శర్మ కాలక్షేపంకబుర్లు-గుడ్డివాడైన భర్తను పుత్రులచే గంగలో తోయించిన ఇల్లాలు-Surrogated mothers

Posted on అక్టోబర్ 10, 2011
గుడ్డివాడైన భర్తను పుత్రులచే గంగలో తోయించిన ఇల్లాలు

దీర్ఘతముడు=గుడ్డివాడు.దీర్ఘమైన తమము అనగా చీకటికలవాడు అనగా గుడ్డివాడు.

గర్భిణిఅయిన యుతద్యుడనే ముని భార్య మమతను దేవరన్యాయంగా బృహస్పతి సంతతికోసం సంగమం కోరుతాడు. గర్భస్థుడైన బాలకుడిది అన్యాయమని ఎదిరిస్తాడు. దానికి కోపించిన బృహస్పతి సర్వజీవులకు ఇష్టమైన సంగమాన్ని వ్యతిరేకించినందులకు గర్భస్తుడైన బాలుడిని గుడ్డివాడివి కమ్మని శపిస్తాడు. దీర్ఘతముడు అనగా గుడ్డివాడుగా పుట్టి మామతేయుడు అనే పేరుతో వేదం చదువుకుని బహుకాలం తరువాత ప్రద్వేషిణి అను ఆమెను వివాహం చేసుకుని ఆమెయందు గౌతముడు మొదలుగా చాలా మంది పుత్రులను కంటాడు. ఒకనాడు గుడ్డివాడు నన్ను ఎందుకు మెచ్చుకోవని భార్యను అడుగుతాడు.దానికామె

” పతియు భరించు గావున భర్తయయ్యె
భామ భరియింపబడు గాన భార్య యయ్యె
బరగ నవి మనయందు విడ్వడియె నిన్ను
నేన యెల్లకాలము భరియింతుగాన” ……………….శ్రీమహా భారతం…ఆది పర్వం.226.

భరించేవాడు భర్త భరింపపడెది భార్య మనవిషయంలో ఇవితేడాగా వున్నాయి, నిన్ను నేను యెల్లకాలమూ భరిస్తున్నాను గనక అని. ఎల్లకాలమూ నిన్ను భరించలేనుకనక ఎక్కడికైన పొమ్మని చెప్పింది. అందుకా గుడ్డివాడు కోపించి ఇక ముందు స్త్రీలు పతిని కోల్పోతే ఎంత ధనవంతురాలయినా మాంగల్యము, అలంకారములు లేకుండా శాపం ఇచ్చాడు. దానికామె కోపించి ఈ ముసలాణ్ణి ఎక్కడేనా విడిచి రమ్మని పుత్రులకు చెప్పింది. ………. “అని శాపంబిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి ఇమ్ముదుకని నెటయేనియుం గొనిపొండని తన కొడుకులంబంచిన వారును నయ్యౌతధ్యు నతివృద్ధు జాత్యంధు నింధనములతోబంధించి మోహాంధులయి గంగలో విడచిన నమ్మునియును బ్రవాహవేగంబులున పెక్కుదేశబులుగడచి చనియె నంతనొక్కనాడు బలియను రాజు గంగాభిషేకార్ధంబు వచ్చినవాడయ్యింధనబంధంబునుండియు నుదాత్తానుదాత్తస్వరితప్రచయభేదంబులేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచు దరంగఘట్టనంబునందనయున్నదరిజేరవచ్చిన వాని దీరంబుచేర్చిఇందనబంధమ్ములువిడిచి……….” శ్రీ మహాభారతం……ఆదిపర్వం 229.

పుత్రులు తండ్రిని కట్టెలతోకట్టి గంగలో తోసేశారు. గుడ్డివాడు గంగాప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్నాడు., ఒకరోజు గంగలో కొట్టుకుపోతూ సుస్వరంతో వేదం చదువుతున్న గుడ్డివాణ్ణి దరికి చేర్చి ఒకరు తనను బలి అనే రాజుగా పరిచయం చేసుకుని ఎక్కడనుంచి వస్తున్నారని అడిగి తెలుసుకుని, తన సౌధనికి తీసుకెళ్ళి, నాకు పుత్రులులేరు, పుత్రదానం చేయమని భార్య సుదేష్ణను పంపించితే ఆమె ముసలివాడని ఏవగించుకుని తనదాసి కూతుర్ని పంపించింది. ఆమెకు గుడ్డివాడు పదకొండు మంది పుత్రులను కలగచేస్తాడు. రాజు వీళ్ళంతా తనభార్య పుత్రులేననుకుంటూవుంటే కాదని నిజం చెబుతాడు. అప్పుడు మళ్ళీ సుదేష్ణను పంపితే ఆమె అంగములన్నీ తడవి నీకు గొప్పవాడైన కొడుకు పుడతాడని అనుగ్రహించగా అంగరాజను రాజర్షి పుడతాడు……………………………………

. ఇది ఒక పూర్వ చరిత్రగా భీష్ముడు తల్లియైన సత్యవతికి, అంబిక, అంబాలికలకు ఈప్రకారంగా బిడ్డలు కలగవచ్చునని చెప్పే సందర్భములోనిది. బృహస్పతి మమతను సరొగెటెడ్ మదర్ గా అడిగిన కాలంలో ,అప్పటి ఆచారం ప్రకారం మమత ఆమె భర్త ఇష్టాఅయిష్టాలతో పని లేక మమత సరొగెటెడ్ మదర్ కావలసిన పరిస్థితి. దీనిని గుడ్డివాడు ఎదుర్కొని శాపం పాలయ్యడు. ఐతే తన జీవిత కాలంలోనే తాను వ్యతిరేకించిన దానిని మరియొక రూపంలో తానే అమలు చేసి దాసియందు మరియు మహరాణి సుదేష్ణ యందు బిడ్డలని కంటాడు. రెండవ సందర్భంలో కూడా స్త్రీలయొక్క ఇష్టాఅయిష్టాలతో పనిలేదు. పరపురుషునితో రమించి తనభార్య బిడ్డలను కనడానికి భర్తైన రాజు బలి ఒప్పుకుకున్నాడు. మొదటిదానిలొ భార్యా భర్తల ఇద్దరి ఇష్టాఅయిష్టాలతో పని లేదు. అంటే ఒక తరం మారేటప్పటికి కొంత మార్పు వచ్చింది. అదే ప్రకారంగా అంబిక, అంబాలికలయందు వ్యాసుడు పుత్రులను కంటాడు. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. మొదటి సందర్భంలో సరోగేటెడ్ మదర్ కి బిడ్డపై హక్కు లేదు. అల్లాగే రెండవ సందర్భంలో సరొగేటెడ్ ఫాదర్కి బిడ్డ పై హక్కులేదు. ఇంకావుంది…..రేపుమిగతా…కరంటులేదుమరి…………………………….